కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండడంతో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. స్వామిని దర్శించుకోవడానికి క్యూ లైన్లలో గంటల తరబడి బారులుదీరారు. స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బొజ్జ పోతన ఆలయం వరకు వాహనాల రద్దీ నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈవో శ్రీకాంత్, సూపరింటెండెంట్​ చంద్రశేఖర్  అవసరమైన చర్యలు చేపట్టారు.